మైసూరు: గ్రీన్దసరా నినాదంతో ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం, దసరా ఉత్సవ కమిటీలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా దసరా ఉత్సవాల్లో నిర్వహించనున్న క్రీడాపోటీలను ఒలింపిక్ క్రీడల్లో వెండి పతకాన్ని సాధించిన పీ.వీ.సింధుచే ప్రారంభించడానికి నిర్ణయించుకున్నట్లు దసరా ఉత్సవ కమిటి అధ్యక్షుడు డీ.రందీప్ మంగళవారం తెలిపారు.
ఆమె అంగీకరించిన అనంతరం దసరా కార్యాచరణ సమితి నుంచి అధికారికంగా ఆహ్వానపత్రికను అందించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఒలింపిక్ క్రీడల్లో కుస్తీ, జిమ్నాస్టిక్ విభాగాల్లో పతకాలు సాధించిన సాక్షిమాలిక్,దీపాకర్మాకర్లను క్రీడాపోటీలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడానికి భారతీయ అథ్లెటిక్ అసోసియేషన్ ద్వారా ఆహ్వానాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.