రాధారవిపై నిషేధం చెల్లదు : హైకోర్టు తీర్పు

22 Sep, 2016 02:15 IST|Sakshi

తమిళసినిమా: నడిగర్ సంఘానికి ఎదురు దెబ్బ తగిలింది. నడిగర్ సంఘంలో అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డ ఆ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, రాధారవి, వాగై చంద్రశేఖర్‌లను సభ్యత్వం నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ఇటీవల సంఘ నూతన కార్యవర్గం వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా తనను సంఘం నుంచి నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సంఘ మాజా కార్యద ర్శి రాధారవి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తి సుందరేశన్ సమక్షంలో విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తి సుందరేశన్ రాధారవిపై నిషేధం చెల్లదంటూ తీర్పునిచ్చారు.
 

మరిన్ని వార్తలు