మహారాష్ట్ర సీఎంతో హరీష్రావు భేటీ

10 May, 2016 16:56 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్రావు మంగళవారం మధ్యాహ్నం భేటీయ్యారు. కాళేశ్వరం, తమ్మిడిహెట్టి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇరురాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టల నిర్మాణాలపై మహారాష్ట్రతో వివాదాలను పరిష్కరించే దిశగా ఈ భేటీ కొనసాగుతోంది.

గోదావరి నదిపై ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌లు, ఆనకట్టల నిర్మాణాలకు సంబంధించి ముసాయిదాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వానికిచ్చింది. తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఎత్తు 148 మీటర్లుగా ప్రతిపాదించారు. దీంతో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయని ఆ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు