పల్లె వెలుగు బస్సును నడిపిన మంత్రి

10 May, 2017 15:53 IST|Sakshi
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ- బీర్కూరు మధ్య నూతన మినీ పల్లె వెలుగు బస్సును స్వయంగా రాష్ట్ర మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి నడిపి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ బస్టాండులో రూ. 10 లక్షలతో నిర్మించే అదనపు ఫ్లాట్ ఫాంలకు శంఖుస్థాపన చేశారు. అలాగే, మిషన్ కాకతీయ -3లో భాగంగా రూ.86.95 లక్షలతో బాన్సువాడ మండలం రాంపూర్ చెరువు పునరుద్దరణ పనులను ప్రారంభించారు.
మరిన్ని వార్తలు