-మోదీ దిష్టిబొమ్మ దహనం
మందమర్రి: పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అదిలాబాద్ జిల్లా మందమర్రిలోని కోల్బెల్ట్ రహదారిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని.. దీని వల్ల మధ్య తరగతి ప్రజలపై విపరీతమైన భారం పడుతోందని ఆందోళన చేశారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.