దొంగ అరెస్ట్: రూ.11 లక్షలు స్వాధీనం

25 Nov, 2016 13:02 IST|Sakshi
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వలసపాకల గ్రామానికి చెందిన కొరణాల పైడిరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి రూ.11 లక్షల విలువైన 448 గ్రాముల బర గారు ఆభరణాలు, 300 గ్రాముల నల్లమందును, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మీడియా ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ, పలువురు డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు