సచివాలయంలో సంచార రైతు బజార్

12 Dec, 2016 15:10 IST|Sakshi
అమరావతి: ‌వెలగపూడి సచివాలయంలో సంచార రైతు బజార్ ను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. సచివాలయం ఉద్యోగుల కోసం వారానికి మూడు రోజుల పాటు ఈ సంచార రైతు బజార్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సదుపాయం పట్ల మహిళా ఉద్యోగులు సంతృప్తిని వ్యక్తం చేశారు. రూ.2.5 లక్షలతో కూరగాయల వాహనం కొనుగోలుకు వడ్డీ లేని రుణంతో ఐదేళ్ల కాల పరిమితితో చెల్లించే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని పుల్లారావు తెలిపారు.
మరిన్ని వార్తలు