బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలకేంద్రం పాత బాన్సువాడ ప్రాంతంలోని మూడిళ్లలో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న బసవరాజు, నాగరాజు, మరో వ్యక్తి ఇళ్లలో ఒకేసారి దొంగలు పడి రూ.15 వేల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. నిజామాబాద్లో ఓ ఫంక్షన్కు హాజరై తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఈ విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.