రాయచోటి: వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చింది. గాలివీడు మండలం గోపనపల్లె గ్రామం నక్కవాండక్లపల్లెకు చెందిన నారాయణమ్మ కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చిందని.. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.