నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర

8 Jan, 2017 11:23 IST|Sakshi
నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర

కర్నూలు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’  నేడు(ఆదివారం) నాలుగోరోజుకు చేరుకుంది. నేటి యాత్ర వెలుగోడు మండలం వేల్పనూరులో ప్రారంభమైంది. అక్కడి నుంచి సంతజుటురు, నారాయణపురం, చిన్నదేవలపురం, లింగాపురం, జీసీ పాలెం, సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠాపురం, వీర్నపాడు మీదుగా వైఎస్ జగన్ రోడ్ షో కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు. నేటి యాత్రలో భాగంగా లింగాపురంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన తనయుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఇవిష్కరించున్నారు.