-
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
– రూ.1.80 లక్షలు నగదు స్వాధీనం – వైఎస్ జగన్ రోడ్షోలు, బహిరంగ సభల్లో చేతివాటం – శ్రీశైలం నుంచి బండిఆత్మకూరు వరకు రోడ్షోను అనుసరించిన ‘ముఠా’ - ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో వీరిపై కేసులు కర్నూలు: రోడ్షోలు, బహిరంగ సభలు లక్ష్యంగా చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ‘ముఠా’ ఆటకట్టించారు పోలీసులు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 17 మంది దొంగలను ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,80,380 నగదును స్వాధీనం చేసుకొని ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం డీఎస్పీ సుప్రజతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 17 మంది వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా అనేక నేరాలకు పాల్పడ్డారు. రైతు భరోసా యాత్ర పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ముఠాసభ్యులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ నేతృత్వంలో ఆత్మకూరు సీఐలు కృష్ణయ్య, శ్రీశైలం వన్టౌన్ ఎస్ఐ వరప్రసాద్, టూటౌన్ ఎస్ఐ ఓబులేసు, ఆత్మకూరు ఎస్ఐ లోకేష్కుమార్, కర్నూలు సీసీఎస్ హెడ్కానిస్టేబుల్ మస్తాన్ తదితరులు దొంగలపై నిఘాపెట్టి అరెస్టు చేశారు. ఆత్మకూరు, శ్రీశైలం పోలీసు స్టేషన్ల పరిధిలో వీరు పలు నేరాలకు పాల్పడ్డారు. శ్రీశైలం నుంచి బండి ఆత్మకూరు వరకు రైతు భరోసా యాత్రను అనుసరించి బహిరంగ సభ, రోడ్షోల్లో చేతివాటం ప్రదర్శించి దొంగతనాలకు పాల్పడ్డారు. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా వీరిపై చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రోడ్షో కార్యక్రమంలో కూడా ఈ ముఠా సభ్యులు చోరీలకు పాల్పడినట్లు విచారణలో బయటపడిందన్నారు. భవిష్యత్తులో వీరిపై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీశైలంలోని శిఖరేశ్వరం వద్ద కొందరిని, ఆత్మకూరులోని చక్రం హోటల్ వద్ద మరికొందరిపై నిఘాపెట్టి అరెస్టు చేశారు. మొత్తం 12 కేసుల్లో వీరు దొంగలించిన సొత్తుకు సంబంధించి రూ.1,80,380 నగదును స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన మూడు బైకులు, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరందరిపై సస్పెక్ట్ సీట్లు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వారి వేలి ముద్రలను సేకరించి పోలీసు శాఖ ఆన్లైన్లో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ప్రిన్స్అనే కొత్త యంత్రాన్ని త్వరలో అమలులోకి తెస్తున్నామని, ఇకపై దొంగలు, రౌడీషీట్ల ఆటలు చెల్లవని ఎస్పీ వెల్లడించారు. పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.నిందితులను ఆత్మకూరు జేఎఫ్సీఎం కోర్టులో హాజరు పరిచారు. ముఠాలోని నిందితుల వివరాలు - షేక్ అహ్మద్ బాషా- అనంతపురం - బలిజ ఈశ్వరయ్య - గోసానిపల్లె, డోన్ - వడ్డె శివ - డోన్ - పూలకొమ్మ కేశవరావు - మార్కాపురం, ప్రకాశం దొండపాటు శ్రీనివాసుల- మార్కాపురం, ప్రకాశం గన్నవరపు శ్రీను - ఎర్రగుండపాలెం, ప్రకాశం పీట్ల ఉప్పతోళ్ల ఇస్రాయిల్ - కృష్ణాపురం, కర్నూలు కుంచాల కోటేశ్వరరావు - వినుకొండ, గుంటూరు మన్నెపల్లె శేషయ్య - పొద్దుటూరు, కడప ఇలగనూరు నాగరాజు - కోటంవేడు, నెల్లూరు సముద్రాల యాకోబ్ - నెల్లూరు కాలటి ప్రతాప్ - ఈవూరుపాలెం, ప్రకాశం చల్లా శ్యాములు - సాకచెర్ల, నెల్లూరు సాతుపాటి సాయి - వైకుంఠాపురం - ప్రకాశం తమ్మిశెట్టి చంద్రశేఖర్ - సిద్ధాపురం, కర్నూలు వేముల రాంబాబు - సిద్ధాపురం, కర్నూలు ఆకు విజయ్ - పెడవళ్లి, అనంతపురం -
నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర
-
నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర
కర్నూలు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ నేడు(ఆదివారం) నాలుగోరోజుకు చేరుకుంది. నేటి యాత్ర వెలుగోడు మండలం వేల్పనూరులో ప్రారంభమైంది. అక్కడి నుంచి సంతజుటురు, నారాయణపురం, చిన్నదేవలపురం, లింగాపురం, జీసీ పాలెం, సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠాపురం, వీర్నపాడు మీదుగా వైఎస్ జగన్ రోడ్ షో కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు. నేటి యాత్రలో భాగంగా లింగాపురంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన తనయుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఇవిష్కరించున్నారు. -
న్యాయం, ధర్మానిదే గెలుపు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పష్టీకరణ • కర్నూలు జిల్లాలో మూడో రోజు ‘రైతు భరోసా యాత్ర’ రైతు భరోసా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు: ‘‘రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్... ఇలా మనం చదివే పవిత్ర గ్రంథాలన్నీ చెప్పేది ఒక్కటే... ప్రలోభాలు, మోసాలు ఒడిపోతాయి. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతారు. చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కర్నూలు జిల్లాలో జగన్ చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ మూడో రోజు శనివారం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి ప్రారంభమైంది. వేల్పనూరులో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘‘ఇప్పటివరకు మనం చూసినా సినిమా అంతా ఇంటర్వెల్ వరకే నడిచింది. ఇప్పటిదాకా విలన్దే పైచేయిగా కనిపిస్తోంది. సినిమాలో 14 రీళ్లు ఉంటే 13వ రీల్ వరకూ విలన్దే పైచేయిగా ఉంటుంది. క్లైమాక్స్లో కథ అడ్డం తిరుగుతుంది. 14వ రీల్లో విలన్ను హీరో చితకబాదుతాడు. దేవుడు పై నుంచి కరుణించి ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. ఇది సినిమా అయినా కానీ, ఏ కథ అయినా కానీ చివరకు ముగింపు ఇదే. బాబువన్నీ మోసాలు,అబద్ధాలు, ప్రలోభాలే వేల్పనూరు గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడి నుంచి ఇదే కుటుంబం (బుడ్డా) నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖరరెడ్డిని మీరంతా ఆశీర్వదించి దీవించారు. కానీ ప్రలోభాలకు, మోసాలకు, అన్యాయాలకు పాల్పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరినీ వదిలిపెట్టలేదు. ఆయన మోసాలు, అబద్ధాలు, ప్రలోభాలు ఏ స్థాయికి చేరాయంటే చివరికి వీరి (బుడ్డా శేషారెడ్డిని చూపిస్తూ) కుటుంబాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ కుటుంబంపై నాకు నమ్మకం ఉంది. కుటుంబంలో ఒకరు తప్పు చేసినా క్షమించే మంచి గుణాన్ని మనందరికీ దేవుడు ఇచ్చాడు. శేషును(బుడ్డా శేషారెడ్డి) మీరందరూ దీవించండి. మీ అందరి ఆశీస్సులు శేషుపై చూపించండి. హామీలిచ్చారు.. దగా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేయకుండా ఎవరినీ వదిలిపెట్టలేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల ముందు మైకు పట్టుకుని చెప్పారు. అప్పుడు ఏ టీవీలో చూసినా ఇవే హామీలు, ఏ గోడలపై చూసినా ఇవే రాతలు. ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను దగా చేశారు. అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. గద్దెనెక్కాక విస్మరించారు. చివరకు చదువుకుంటున్న పిల్లలను, చదువులు పూర్తిచేసుకొని ఉద్యోగా ల కోసం వెతుక్కుంటున్న వారిని కూడా వదల్లేదు. జాబు కావాలంటే బాబు ముఖ్య మంత్రి కావాలని ప్రచారం చేశారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చివరకు మొండిచేయి చూపారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లభించడం లేదు. పేదలకు కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదు. మోసాలకు, అన్యాయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం’’ అని జగన్ తేల్చి చెప్పారు. అనంతరం అబ్దుల్లాపురంలో పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి బయలుదేరి వెలుగోడులో రోడ్షో నిర్వహించారు. అనంతరం బోయరేవుల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి మోత్కూరు, తిమ్మనపల్లి వరకూ రైతు భరోసా యాత్ర కొనసాగింది. అనంతరం జగన్ అబ్దుల్లా పురం, మోత్కూరు గ్రామాల్లో స్థానిక రైతులు, కూలీలతో మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వారు తమకు పంట గిట్టు బాటు ధర లభించని తీరును, పింఛన్లు అందని వైనాన్ని జగన్ దృష్టికి తెచ్చారు. వారందరికి ఆయన ధైర్యం చెప్పారు. ప్రజల సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరాడుతోందని భరోసా ఇచ్చారు. -
ఆత్మీయ నేస్తం
జనసంద్రంగా రైతు భరోసా యాత్ర - చాకలి వెంకటేశ్వర్లు కుటుంబానికి ఓదార్పు - కదిలివచ్చిన రైతులు, వ్యవసాయ కూలీలు - గిట్టుబాటు ధర లేదని ఆవేదన - మనవడికి ఆప్యాయత పంచిన వృద్ధులు - అడుగడుగునా అక్కాచెల్లెళ్ల ఆనందోత్సాహం - స్వాగతం పలికిన ఊరూవాడా అదిగో రాజన్న బిడ్డ.. పొలాల్లోంచి పరుగు పరుగున వచ్చిన కూలీలు. మనవడి రాక.. నడవలేకపోయినా అతికష్టం మీద రోడ్డు మీదకొచ్చిన వృద్ధులు. రైతు నేస్తం.. కష్టాలు తెలిసిన నేతతో గోడు చెప్పుకున్న రైతన్నలు. జగనన్న.. అక్కా చెల్లి.. అన్నా తమ్ముడు పంచిన ఆత్మీయతతో ఊరూవాడా మురిసింది. కన్నీళ్లు తుడుస్తూ.. జీవితాలకు భరోసానిస్తూ సాగిన యాత్ర ఆద్యంతం జగమంత కుటుంబాన్ని తలపించింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: రైతుల కష్టాలు తెలిసిన నేతగా ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలకు భరోసానిచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడవ రోజు శనివారం వెలుగోడు మండలంలో సాగింది. వేల్పనూరు నుంచి ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని పురాతన ఆలయమైన ఆంకాళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బుడ్డా వెంగళరెడ్డి కుటుంబంపై తనకు నమ్మకం ఉందని.. కుటుంబంలో ఒక్కరు తప్పు చేసినా క్షమించే గుణం మనకు ఉందని గుర్తు చేశారు. అయితే రైతులు, మహిళలు, యువతతో పాటు బుడ్డా కుటుంబాన్నీ చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అక్కడి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ అబ్దుల్లాపురం మీదుగా వెలుగోడుకు చేరుకున్నారు. అబ్దుల్లాపురంలో మినుము పంటను పరిశీలించారు. తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదని.. రుణమాఫీ కాకపోవడంతో తాకట్టు పెట్టిన గొలుసు బ్యాంకులోనే ఉండిపోయిందని రైతు వెంకటాచారి ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో కొత్త నోట్లు రావడం లేదని.. సద్ది కట్టుకునిపోయి లైన్లో ఉంటున్నామని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తమకు రోజువారీ కూలి రూ.110 నుంచి రూ.130 వరకు వస్తోందని.. నోట్ల రద్దు తర్వాత రైతులు కూలి డబ్బు ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ కూలీలు వాపోయారు. వచ్చేసారి కచ్చితంగా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలు వైఎస్ జగన్కు హామీ ఇచ్చారు. అనంతరం వెలుగోడుకు చేరుకున్న ఆయన వైఎస్ఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్షో నిర్వహించారు. పింఛన్లు ఇవ్వడం లేదు..! వెలుగోడులో నిర్వహించిన రోడ్డు షోలో అడుగడుగునా ప్రజలు తమ బాధలు జననేతకు చెప్పుకునేందుకు ముందుకొచ్చారు. తమకు పింఛన్లు ఇవ్వడం లేదని, వేలిముద్రలు పడటం లేదని చెప్పి ఉన్న పింఛన్లను కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు వృద్ధులు వాపోయారు. అదేవిధంగా భర్తలను కోల్పోయిన వితంతువులు కూడా తమకు కొత్తగా పింఛన్లను ఇవ్వడం లేదని.. నెలల తరబడి ఎదురు చూస్తున్నామని తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇక రైస్ మిల్లు కార్మికులు కూడా తమకు వేతనాలు తక్కువగా ఇస్తున్నారని.. రైస్ మిల్లులు కూడా సరిగ్గా నడవని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. వారి బాధలు వింటూ త్వరలోనే మంచిరోజులు వస్తాయని భరోసా ఇస్తూ జగన్ ముందుకు కదిలారు. అక్కడి నుంచి బోయరేవులలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబానికి భరసానిచ్చారు. కుటుంబం వెంట తాము ఉంటామని ధైర్యం చెప్పారు. గిట్టుబాటు ధర కరువు బోయరేవుల నుంచి మోత్కురుకు చేరుకుని అక్కడ వడ్ల కళ్లంలో రైతులతో వైఎస్ జగన్ ముచ్చటించారు. తమకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మినుము, మిరప, ధాన్యాలు, కంది.. ఇలా ఏ పంటకూ చంద్రబాబు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యిందని జగన్ ధ్వజమెత్తారు. వరుస కరువుతో ఇబ్బందులు పడుతున్న రైతాంగం.. పండిన కొద్దిపాటి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించి ఆదుకునేందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అక్కడి నుంచి తిమ్మనపల్లికి చేరుకుని మూడో రోజు రైతు భరోసా యాత్రను ముగించారు. మూడవ రోజు రైతు భరోసాలో సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి భరోసా కల్పించారు. ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమైన యాత్ర రాత్రి 7 గంటల వరకూ సాగింది. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజయ్య, పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, రైతు సంఘం నేతలు నాగిరెడ్డి, వంగాల భరత్కుమార్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, పోచా శీలారెడ్డి, కర్రా హర్షవర్దన్ రెడ్డి, పోచా జగదీశ్వర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, రాజా విష్ణువర్దన్ రెడ్డి, తరిగోపుల భాస్కర్ రెడ్డి, పర్ల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement