'నయీం, మంత్రిపై సీబీఐ విచారణకు డిమాండ్'

24 Aug, 2016 14:28 IST|Sakshi
'నయీం, మంత్రిపై సీబీఐ విచారణకు డిమాండ్'

శ్రీకాకుళం : గ్యాంగ్స్టర్ నయీంతో కార్మిక,  క్రీడాల శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఉన్న సంబంధాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు.

శ్రీకాకుళంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపణలపై టీడీపీ నేతలు స్పందించాలన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు స్పందించడం లేదంటే వారి ప్రమేయం ఉన్నట్లు అనుమానించాల్సి వస్తోందని తమ్మినేని అన్నారు.

మరిన్ని వార్తలు