19 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

11 Feb, 2015 15:23 IST|Sakshi

వరంగల్:  ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలో ఇసుక క్వారీలపై  బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 19 ట్రాక్టర్లను మామునూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇసుకను వరంగల్ పట్టణానికి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వాటిని పోలీసులు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మామునూర్)

మరిన్ని వార్తలు