నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

18 Jun, 2016 11:36 IST|Sakshi

ఇంక్లైన్ కాలనీ : కరీంనగర్ జిల్లా ఎయిట్ ఇంక్లైన్ కాలనీలోని శ్రీలంక షిర్కే క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఓ నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు మోహిద్(9), సల్మాన్(7) లను అన్నదమ్ములుగా గుర్తించారు. ఇద్దరు చిన్నారుల మృతితో కాలనీలో విషాదం అలుముకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు