ఏఈవో పోస్టులకు 2 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

26 Feb, 2018 02:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేడ్‌–2 అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(ఏఈవో) పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థులకు మార్చి 2 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచినట్లు పేర్కొంది. వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా, ఇతర వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు