సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు: చాడ

31 Aug, 2017 19:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం, బీజేపీ వక్రీకరించి మాట్లాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీరించినంత మాత్రాన ప్రజలు మరచిపోరని అన్నారు. హైదరాబాద్‌ మఖ్దుం భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ప్రచార యాత్రలు చేపడతామని, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు.

సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని, 17వ తేదీన విలీన దినోత్సవం జరుపుతామని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక అభివృద్ది కుంటుపడుతోందని, అక్టోబర్ 6 నుంచి డిసెంబరు 3వ తేదీ వరకు పోరు యాత్ర జరుపుతామని, కరీంనగర్‌లో ఆఖరి రోజు భారీ బహిరంగ సభ జరుగుతుందని, ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చాడ తెలిపారు.

మరిన్ని వార్తలు