కోహ్లి దూకుడు | Sakshi
Sakshi News home page

కోహ్లి దూకుడు

Published Thu, Aug 31 2017 4:13 PM

కోహ్లి దూకుడు - Sakshi

కొలంబో:శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న నాల్గో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడును కొనసాగిస్తున్నారు. కోహ్లి 76 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ సాధించాడు. తొలుత 38 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లి.. మరో 38 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నారు. కోహ్లి జోరుకు భారత్ బ్యాటింగ్ పరుగులు పెడుతోంది. ఓపెనర్ శిఖర్  ధావన్(4) అవుటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మరోసారి తనలోని విశ్వరూపాన్ని ప్రదర్శించిన కోహ్లి స్కోరు బోర్డును వేగంగా ముందుకు తీసుకువెళుతున్నారు.

 

అతనికి రోహిత్ శర్మ చక్కటి సహకారం అందిస్తున్నారు. రోహిత్ సైతం హాఫ్ సెంచరీ సాధించారు.  కోహ్లి, రోహిత్ ల  జోరుకు భారత జట్టు 26.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 201 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత్ మరో మ్యాచ్ గెలిచి లంకేయులపై మరింత ఆధిక్యాన్ని సాధించాలని యోచిస్తోంది.

Advertisement
Advertisement