మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌

6 Dec, 2019 19:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సమ్మె కాలంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల ప్రతి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగ్యం ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ గత వారం సూచించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే సమ్మెలో భాగంగా మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుగు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు.  ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్ జోన్‌ పరిదిలో చనిపోయిన పదిమంది కార్మికుల కుటుంబ సభ్యలకు ఉద్యోగాలు కేటాయించింది. ఇందులో భాగంగా నలుగురికి జూనియర్‌ అసిస్టెంట్లుగా.. అయిదుగురికి కానిస్టేబుళ్లుగా.. ఒకరిని కండక్టర్‌గా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగాలు కేటాయించింది. 

మరిన్ని వార్తలు