ఎన్నిసార్లు పెంచుతారు.. దోచుకోవడానికా..!

15 May, 2015 21:18 IST|Sakshi

కరీంనగర్: పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్రో ధరలను పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కరీంనగర్ పట్టణంలో సీపీఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. సామాన్య ప్రజలపై పెట్రో భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముకుందారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలను దోచుకోవడం కోసం ఈ చర్య తీసుకున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు