చెట్టును ఢీకొని మృతి | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొని మృతి

Published Fri, May 15 2015 9:24 PM

youth died with accident

కరీంనగర్: వివాహానికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి చెందిన సంఘటన కరీంనగ ర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... పెద్దపల్లి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన కటికెనపల్లి శ్రీనివాస్(36) అనే యువకుడు తన సమీప బంధవుల ఇంట్లో జరిగిన వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. రైల్వేగేట్ సమీపంలోని మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement