‘డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి’

10 Dec, 2014 07:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సంబంధం లేకుండా వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం టీటీజేఏసీ సమావేశం సందర్భంగా పలువురు నిరుద్యోగులు అక్కడికి వచ్చారు. టీటీజేఏసీ తరపున డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.

ఈ సందర్భంగా టీటీజేఏసీ చైర్మన్ వెంకట్‌రెడ్డికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పేరుతో నోటిఫికేషన్ జారీలో జాప్యం చేస్తోందని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
 

మరిన్ని వార్తలు