ఈఎన్‌సీ మురళీధర్ పదవీకాలం పొడిగింపు

1 Jul, 2015 01:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) సి.మురళీధర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు సెంట్రల్ డిజైన్ ఆర్గైనె జేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.ప్రదీప్‌కుమార్, పదవీ విరమణ చేసిన కారణంగా ఆయన స్థానంలో క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.నరేందర్‌రెడ్డికి చీఫ్ ఇంజనీర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మరో ఉత్తర్వు కూడా జారీ చేశారు.

మరిన్ని వార్తలు