పైరు ఎండిపోయిందని రైతు ఆత్మహత్య

17 Jul, 2015 16:39 IST|Sakshi

మద్నూర్ (నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం లింబూరు గ్రామానికి చెందిన రైతు మస్తాజి(30) శుక్రవారం గ్రామ శివారులో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. తన పొలంలో వేసిన సోయా పైరు వానల్లేక ఎండిపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రుణ భారం తీరేలా లేదని దిగులుపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

>
మరిన్ని వార్తలు