మేయర్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం

13 Jan, 2015 17:00 IST|Sakshi

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని మేయర్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం సంభవించి విపరీతంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భవనంలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

మేయర్ కొంకణి లక్ష్మీనారాయణ ఛాంబర్ లో ఉన్న ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఆస్తినష్టం ఎంత సంభవించిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు