ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

3 Mar, 2019 16:50 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరమల్ల ప్రసన్న-రేపాక గణేష్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే గణేష్‌ వివాహానికి నిరాకరించడంతో.. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను పోలీసులు అడ్డుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు