కుర్మగడ్డలో గోవా స్పీకర్‌ ప్రమోద్‌

8 Jun, 2018 13:00 IST|Sakshi
కృష్ణానదీ తీరంలో గోవా స్పీకర్‌ ప్రమోద్‌ సావంతు, తదితరులు   

మక్తల్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలంలోని పవిత్రమైన కృష్ణా నదీ తీరాన, కర్ణాటక పరిధిలోకి వచ్చే కుర్మగడ్డలో దత్త క్షేత్రాన్ని గోవా రాష్ట్రం అసెంబ్లీ స్పీకర్‌ ప్రమోద్‌ సావం తు గురువారం దర్శించుకున్నారు. తొలుత మక్తల్‌ చేరుకున్న ఆయన పుట్టిలో నదీ మీదు గా దత్త క్షేత్రానికి వెళ్లారు. తిరిగి అక్కడి నుంచి వచ్చి మక్తల్‌ పరిధిలోని పస్పుల దగ్గర శ్రీ పాద వల్లభుని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ను ఆలయ కమిటీ బాధ్యులు సన్మానించారు.

మరిన్ని వార్తలు