వచ్చే నెల 7లోపు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఈసీకి ఆదేశం

30 Jan, 2019 12:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వీవీ ప్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వేసిన ఎలక్షన్‌ పిటిషన్‌ను బుధవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. వచ్చే నెల 7 వరకూ ఈ పిటిషన్‌కు సంబంధించి పూర్తి సమాచారంతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ.. హై కోర్టు కేంద్ర ఎ‍న్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ మల్‌రెడ్డి రంగారెడ్డితో పాటు ఉత్తం పద్మావతి, ధర్మపురి లక్ష్మణ్‌లు కూడా పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు