‘13న యథావిధిగా ఇంటర్‌ పరీక్షలు’

9 Mar, 2018 03:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఈ నెల 13వ తేదీన ఎమ్మార్పీఎస్‌ బంద్‌కు పిలుపునిచ్చిన దృష్ట్యా ఆరోజు జరగనున్న ఇంటర్‌ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఇంటర్మీడియెట్‌ బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 13న 1,294 కేంద్రాల్లో కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షలను వాయిదా వేస్తే ఆ ప్రభావం నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలపై పడుతుందని వివరించింది. పరీక్షల నిర్వహణకు అందరూ సహకరించాలని బోర్డు కోరింది.

మరిన్ని వార్తలు