ఫిబ్రవరిలో అనాథల అంతర్జాతీయ సదస్సు

29 Dec, 2019 02:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనాథల అంతర్జాతీయ సదస్సును ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నాగోల్‌ సమీపంలోని జె–కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నట్లు ఫోర్స్‌ (ఫోర్స్‌ ఫర్‌ ఆర్షన్‌ కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్‌) అధ్యక్షుడు గాదె ఇన్నయ్య తెలిపారు. శనివారం బీసీ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య సదస్సు వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లా డుతూ అనాథల హక్కుల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. వీరికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, ఉచిత విద్యతో పాటు ఉపాధి కలి్పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. అనంతరం గాదె ఇన్నయ్య మాట్లాడుతూ ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, టి.నందగోపాల్, రాంకోటి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు