వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి కాంట్రాక్టు ఏఎన్ఎంల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: పూర్వపు వరంగల్ జిల్లాలో ఏఎన్ఎంల క్రమబద్ధీకరణలో అవకతవకలు జరిగాయని బాధిత కాంట్రాక్టు ఏఎన్ఎంలు ఆరోపించారు. అన్ని అర్హతలున్నప్పటికీ జాబితా నుంచి తమ పేర్లు తొలగించారన్నారు. గురువారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి వారు ఫిర్యాదు చేశారు.
జాబితాలో పేర్ల తారుమారుపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, నెలరోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహంవ్యక్తంచేశారు.