హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై వారితో చర్చించారు.
జిల్లాలో విద్యుత్ కొరత గురించి కేసీఆర్ అధికారులతో మాట్లాడారు. సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డుల జారీ, పెన్షన్లు ఇచ్చే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీపై కూడా కేసీఆర్ చర్చించారు.