యువకుడిపై కేసు నమోదు
కొత్తూరు : ప్రేమ పేరుతో యువతిని మోసంచేసిన యువకుడిపై షాద్నగర్ రూరల్ సీఐ మధుసూదన్ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు... విజయవాడకు చెందిన పవన్కుమార్ కొన్నేళ్లుగా కొత్తూరులో నివాసం ఉంటూ స్థానిక పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ఓ పెళ్లిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి(27)తో పరిచయమైంది.
అది ప్రేమగా మారిం ది. నాలుగేళ్లుగా కలిసితిరిగారు. కొంతకాలంగా పలుమార్లు ఆ యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో పవన్కుమార్ అప్పుడూ ఇప్పుడంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఇటీవల మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలియడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.