మావోయిస్టులూ వ్యతిరేకిస్తున్నారు

3 Nov, 2014 01:41 IST|Sakshi
మావోయిస్టులూ వ్యతిరేకిస్తున్నారు

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై జానా మండిపాటు
మిర్యాలగూడ: టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై అన్ని వర్గాల ప్రజలతోపాటు మావోయిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని చెప్పారు. స్వార్థం కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర పార్టీలకు వలస వెళ్తున్నారని, ప్రజల తమ వెంటనే ఉన్నారని చెప్పారు. నెహ్రూ, గాంధీ వారసత్వాన్ని నిలపడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
 

మరిన్ని వార్తలు