విగ్రహం మాయం ఘటనలో మరో మలుపు

15 Aug, 2017 13:52 IST|Sakshi
బాసర : చదువుల తల్లి కొలువై ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర ఆలయంలో ఉత్సవ విగ్రహం మాయమైన కేసు కీలక మలుపు తిరిగింది. ఆలయ పరిచాలకుడు విశ్వజీత్ కూడా నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన పూజల్లో పాల్గొన్నట్టు ఆధారాలు లభించాయి. తన ఫొటోలు బయటకు రాకుండా ప్రధాన పూజారి సంజీవ్ మహరాజ్, మరో పూజారి ప్రణవ్ శర్మల ఫొటోలను మాత్రమే విశ్వజీత్ ఆలయ అధికారులకు ఇచ్ఛినట్లు సమాచారం. ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు, ఆలయ అధికారులు ఆయనపై కూడా విచారణ చేపట్టారు.
మరిన్ని వార్తలు