'ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదు'

28 Jun, 2015 16:56 IST|Sakshi
'ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదు'

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఈ కేసు చట్టప్రకారం నడుస్తుందని చెప్పారు.

హైదరాబాద్లో సెక్షన్ 8 అమలుపై గవర్నర్ నరసింహన్కు అధికారం లేదని, బాధ్యత మాత్రమే ఉందని కేశవరావు అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తెరపైకి వచ్చాక హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కేశవరావు స్పందించారు.

మరిన్ని వార్తలు