'సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపిస్తాం'

30 Jun, 2015 18:35 IST|Sakshi

ఆదిలాబాద్(బెజ్జూరు): మూతపడిన సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును తెరిపించి కార్మికులను ఆదుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పునరుద్ఘాటించారు. ఆయన మంగళవారం బెజ్జూరులో కొత్త పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ... త్వరలో యాజమాన్యంతో మాట్లాడి సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లును త్వరలో తెరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా పాల్గొన్నారు.

 

>
మరిన్ని వార్తలు