ఎస్సారెస్సీలో పెరుగుతున్న వరద

14 Jun, 2018 10:55 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇన్‌ఫ్లో  9,342 క్యూసెక్కులుగా ఉంది.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1055.00 అడుగులు (9.287 టీఎంసీలు) లుగా ఉంది. ఈ నెలలో 14 రోజుల్లో ప్రాజెక్టులోకి 2 టీఎంసీల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు