చేప ప్రసాదం పంపిణీలో తొక్కిసలాట

9 Jun, 2015 08:39 IST|Sakshi

హైదరాబాద్: ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రారంభం రోజు ఉబ్బసం రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని మంగళవారం బత్తిన సోదరులు ప్రారంభించారు. అయితే చేపప్రసాదం కార్యక్రమ ప్రారంభంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉబ్బసం రోగులు తరలి వచ్చారు. అయితే జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు గాయపడ్డారు.

మరిన్ని వార్తలు