నిజాం షుగర్స్‌పై అఖిలపక్షం ఏమైంది

26 Mar, 2017 02:59 IST|Sakshi
నిజాం షుగర్స్‌పై అఖిలపక్షం ఏమైంది

సాక్షి, హైదరాబాద్‌: నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని హామీ ఇచ్చి టీఆర్‌ఎస్‌ మోసం చేసిందన్నారు.రైతులు నడిపించుకుంటామంటే ఇస్తా మని, అఖిలపక్షం ఏర్పాటుచేసి చర్చి ద్దామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిం చారు.

కొందరు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై నిజాం షుగర్స్‌ని ప్రభుత్వం పట్టించు కోవడంలేదని ఆరోపించారు. దీనిపై వెంటనే అఖిలపక్షం వేయాలని, నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు