పంజగుట్ట కేంద్రంగా ట్రాఫిక్‌ మళ్లింపులు

14 Mar, 2020 10:44 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పంజగుట్ట శ్మశానవాటిక వద్ద రోడ్డు విస్తరణ, స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం ప్రకటించారు. ఇవి శనివారం నుంచి ఈ ఏడాది జూన్‌ 3 వరకు అమలులో ఉంటాయన్నారు. ఎస్‌ఎన్‌టీ జంక్షన్‌ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్, పంజగుట్ట చౌరస్తాల వైపు ఏ భారీ వాహనాలను అనుమతించరు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌ జంక్షన్, రోడ్‌ నెం.45 జంక్షన్, రోడ్‌ నెం.36 వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌–యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌–మైత్రీవనం మీదుగా లేదా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌–రోడ్‌ నెం.45–బీవీబీ జంక్షన్‌– రోడ్‌ నెం.12 మీదుగా ప్రయాణించాలని ఆయన సూచించారు. 

మరిన్ని వార్తలు