'రకరకాల జీవోలతో ప్రభుత్వం మోసం చేస్తోంది'

26 Jun, 2016 16:45 IST|Sakshi
'రకరకాల జీవోలతో ప్రభుత్వం మోసం చేస్తోంది'

హైదరాబాద్: మల్లన్న సాగర్‌తో పాటూ అన్ని ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జీవో 123తో ఎక్కువ పరిహారం వస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రకరకాల జీవోలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఉత్తమ్ మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు