కేరళకు గుంటూరు కారం

6 Dec, 2023 00:26 IST|Sakshi

కేరళకు ప్రయాణం కానున్నారు మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా తాజా షూటింగ్‌ షెడ్యూల్‌ ముగిసిందని తెలిసింది. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు మహేశ్‌బాబు, మీనాక్షీ చౌదరి కాంబినేషన్‌లో ఓ పాటను చిత్రీకరించారని సమాచారం.

కాగా ‘గుంటూరు కారం’ నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ కేరళలో ఆరంభం కానుందట. కొంత టాకీ పార్టుతో పాటు మహేశ్‌బాబు, శ్రీలీల కాంబినేషన్‌లో ఓ సాంగ్‌ను ప్లాన్‌ చేసిందట యూనిట్‌. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరిపి, ఈ నెలాఖరుకల్లా సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నారట. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

>
మరిన్ని వార్తలు