జూపల్లి రాజీనామా చేయాలి: వంశీచంద్‌

4 Feb, 2017 03:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కుదించడం ద్వారా ప్రభుత్వం రైతుల పొట్టగొడుతుంటే జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. కల్వకుర్తి నియోజకవర్గం ఎడారిగా మారుతున్నా ఏమీ చేయలేని జూపల్లి పదవిలో కొనసాగడం ద్వారా ప్రజలకు ద్రోహం చేస్తున్నాడని శుక్రవారం విమర్శించారు. కల్వకుర్తి ఎత్తిపోతలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై ప్రణాళికసంఘం వైస్‌చైర్మన్‌ నిరంజన్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు.

మరిన్ని వార్తలు