'2019లో కూడా అధికారం మాదే'

4 May, 2015 14:16 IST|Sakshi
'2019లో కూడా అధికారం మాదే'

హైదరాబాద్: 2019లో కూడా  టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పారు.  ప్రజా ప్రతినిధులు మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కేసీఆర్ తెలిపారు. డబ్బు కావాలంటే చాలా మార్గాలున్నాయని.. ప్రజా ప్రతినిధులు మాత్రం ప్రజల పక్షాన్నే నిలవాలని సూచించారు.

 

ప్రతీ ఒక్కరూ చరిత్ర సృష్టించుకునే విధంగా పని చేయాలని..లేని పక్షంలో మనమే చరిత్రలో కలిసిపోతామన్నారు. అనుకన్నది సాధించడం టీఆర్ఎస్ నైజమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలంగాణ రాదన్న వారికి.. దాన్ని సాధించి చూపించామన్నారు.

మరిన్ని వార్తలు