మాల్దాలో 11 మంది శిశువులు మృతి

23 Oct, 2014 16:40 IST|Sakshi

కోల్కతా: పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో గత మూడు రోజుల్లో 11 మంది శిశువులు మృతి చెందారు. మాల్దా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో మూడు రోజుల్లో 11 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు.

బరువు తక్కువగా ఉండడం, శ్వాసకోస సంబంధ సమస్యలే శిశువుల మరణానికి కారణమని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఏ రషీద్ తెలిపారు. మాల్దా జిల్లాలో శిశువుల మరణాలు సాధారణంగా మారాయి. మెదడువాపుతో జూలైలో 12 మంది, జూన్ లో 9 మంది శిశువులు మరణించారు.

మరిన్ని వార్తలు