విశాఖలో అక్రమంగా గంజాయి రవాణా, నలుగురు అరెస్ట్

9 Dec, 2013 22:14 IST|Sakshi

విశాఖపట్నం: అక్రమంగా గంజాయి రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాలపై పోలీసులు దాడులు చేస్తున్నా వారి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. విశాఖ జిల్లాలోని ఆరులోవలో సోమవారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారివద్ద నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అక్రమ గంజాయి తరలిస్తున్న వారిలో ముగ్గురు ఒరిస్సాకు చెందిన కోరాపుట్‌కు చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు