ఏపీకి ప్రత్యేక హోదాపై డాక్యుమెంట్

19 Aug, 2015 19:24 IST|Sakshi
ఏపీకి ప్రత్యేక హోదాపై డాక్యుమెంట్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంట్ రూపొందించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసినపుడు ఈ డాక్యుమెంట్ను అందజేయనున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను ఈ డాక్యుమెంట్లో పొందుపర్చారు. ఇదిలావుండగా, ప్రధాన మంత్రి మోదీతో చంద్రబాబు భేటి వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం గురువారం చంద్రబాబు, ప్రధానితో భేటీ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 తేదీలోపు చంద్రబాబు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తారని సమాచారం.

మరిన్ని వార్తలు