దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లైవ్ బుల్లెట్లు తీసుకెళ్తున్న ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తన వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగేజిలో అతడు ఈ బుల్లెట్లు తీసుకెళ్తున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. వియన్నా నుంచి గోవా వెళ్లేందుకు ముందుగా ఢిల్లీ వచ్చిన ఆస్ట్రేలియన్ పౌరుడిని సాధారణంగా చెక్ చేసినప్పుడు అతడి బ్యాగేజిలో 5.56ఎంఎం లైవ్ బుల్లెట్లు దొరికాయని వివరించారు.
అతడి పేరు డబ్ల్యు జోషెడ్ అని, గోవా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ బుల్లెట్లు తీసుకెళ్లడానికి అతడి వద్ద తగిన పత్రాలు ఏవీ లేవని, అందుకే అదుపులోకి తీసుకుని, ఢిల్లీ పోలీసులకు అప్పగించామని అన్నారు. భారతదేశ చట్టాల ప్రకారం విమానంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకెళ్లడం నేరం.