ట్రాక్టర్ ట్రాలీ మీద పడి బాలుడు దుర్మరణం

8 Sep, 2015 23:24 IST|Sakshi

మంథని: కరీంనగర్ జిల్లా మంథని పట్టణంలోని ఎరుకలగూడెంలో మంగళవారం రాత్రి విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ ట్రాలీ డోర్ మీద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఆకుల శ్రీనివాస్, శిరీష దంపతుల కుమారుడు ఆకెళ్ల రాజ్ కుమార్ (6) యూకేజీ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి ముందు ఓ ట్రాక్టర్ ఆగి ఉండడంతో రాజ్ కుమార్ ఆడుకుంటున్నాడు.

ట్రాక్టర్ ట్రాలీ వెనుక డోర్ పట్టుకుని వేలాడుతుండగా ఒక్కసారిగా ఆ డోర్ వచ్చి అతడి చాతీ భాగానికి తగిలింది. దాంతో రాజ్‌కుమార్ సొమ్మసిల్లి కిందపడిపోయాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీనివాస్ దంపతులకు రాజ్‌కుమార్‌తోపాటు ఓ బేబీ కూడా ఉంది,

మరిన్ని వార్తలు