లండన్: ప్రపంచంలోనే అత్యంత సొగసరి ఆసియన్ మహిళగా బాలీవుడ్ సుందరీమణి కత్రినా కైఫ్ మళ్లీ ఎంపికైంది. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, టీవీ నటి ద్రష్టి ధామి, మరో బాలీవుడ్ నటి దీపికా పడుకొనేలను అధిగమించి ఈ ఘనత సాధించింది. బ్రిటన్కు చెందిన ‘ఈస్టర్న్ ఐ’ పత్రిక 50 మంది ఆసియన్ సుందరీమణులతో రూపొందించిన జాబితాలో కత్రినా వరుసగా నాలుగో ఏడాది సైతం తొలిస్థానంలో నిలిచింది. కత్రినా కైఫ్ నటించిన ధూమ్-3 చిత్రం కొద్ది వారాల్లోనే విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ జాబితా వెలువడటం విశేషం.